Friday, June 27, 2025

నేడే రూ.2 వేల నోట్ల డిపాజిట్ ఆఖరి…-ఓరుగల్లు9నేషనల్ టివి

ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి న్యూఢిల్లీ : రూ. 2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఆర్​బీఐ ఇచ్చిన గడువు నేటితో (సెప్టెంబర్ 30, 2023న).. అంటే శనివారంతో ముగుస్తున్నది. మీ వద్ద ఇంకా రూ. 2,000 నోట్లు ఉంటే వాటిని డిపాజిట్ చేసి మార్చుకోకపోతే, ఈ గడువులోపే చేయండి. ఎందుకంటే, సెప్టెంబరు 30 తరువాత రూ. 2,000 నోట్లతో మీరు ఏమి చేయవచ్చనే విషయమై ఆర్​బీఐ నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. అయితే ఇక నుంచి కూడా ఈ నోట్లు చెలామణిలో ఉంటాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్​బీఐ) ఇది వరకే ప్రకటించింది. అంటే రేపటి నుంచి కూడా రూ. 2,000 నోటు చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతుంది.2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్‌‌బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ “సెప్టెంబర్ 30 తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై నేను మీకు ఊహాజనిత సమాధానం ఇవ్వలేను. చట్టబద్ధమైన టెండర్ స్థితి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే కొనసాగుతుందని మేం చెప్పడం లేదు. అన్ని నోట్లూ డిపాజిట్​ చేయించాలనే ఉద్దేశంతోనే సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చాం. ఇలా చేయకుంటే అన్ని నోట్లు వెనక్కి రావడం కష్టమవుతుంది”అని వివరించారు. దాస్​ ప్రకటనను గమనిస్తే రూ.2 వేల నోటు ఇక నుంచి కూడా లీగల్​ టెండర్​గా కొనసాగుతుందని అర్థం. ఒక రిపోర్టు ప్రకారం రూ.2,400 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ వెనక్కి రాలేదు. మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు డిపాజిట్​ అయ్యాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular