Saturday, May 31, 2025

ఘనంగా జన పోరాట సమితి ద్వితీయ వార్షికోత్సవ సభ :ఓరుగల్లు9నేషనల్ టీవీ

హనుమకొండ: ప్రజావారాధి జన పోరాట సమితి ద్వితీయ వార్షికోత్సవ సమావేశం వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో వర్దన్నపేట నియోజక వర్గా ఇంచార్జి మొండెడ్ల రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి జన పోరాట సమితి వ్యవస్థాపకులు బొడ్డు భరత్ ప్రధాన కార్యదర్శి దేవి సాంబరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత విద్య వైద్యం ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలను కోరారు. ఈ ముడు మాత్రమే ప్రజలకు అందించాలని అన్నారు. ఉచిత పథకాల వల్ల అభివృధి జరగదని ఆ సంక్షేమ పథకాలకు పెట్టే బడ్జెట్ విద్య వైద్యం నికి పెట్టి అందరికి నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. అడ్డగోలుగా ఉచిత పథకాల ప్రవేశపెట్టవద్దు అని కోరారు. ఈ కార్యక్రమంలో MD షాభిమ్, కే. సమ్మయ్య, వంశీ, మండే కొమ్మల్లు, సంజీవ, యస్వీన్, వెంకట్, రాజశేఖర్, రాజేందర్, మల్లికార్జున్, కృష్ణ రెడ్డి, సుమలత, రాధికా, కొమురమ్మ, లావణ్య, సబిత, రాజేశ్వరి, విజయ, కవిత, సుగుణ, మాదవి, స్నేహాలతా, రజిత, తదితరు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular