Thursday, June 26, 2025

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ధర్మసాగర్ లో ఉత్సాహభరితంగా సాగిన బడిబాట

ఓరుగల్లు9నేషనల్ టీవీ :హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 జూన్ నుండి మొదలు 19 జూన్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిభావంతంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారంగా తల్లిదండ్రుల సమావేశాలు, విద్యార్థుల ప్రవేశం కోసం ఇంటింటి ప్రచారం ,స్థానిక విద్యాభిమానులతో సమావేశాలు ,గ్రామసభలు, ర్యాలీలు, నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగత సంబరాలు, లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ,సహిత విద్యా ,బాలిక విద్య దినోత్సవ సందర్భంగా సెమినార్లు తో పాటు ,ముగింపు రోజైన గురువారం నాడు విద్యార్థులకు క్రికెట్ ,సాఫ్ట్ బాల్ లాంటి టీం గేమ్స్ తో పాటు ఇండోర్ గేమ్స్, ఇంటర్ హౌస్ కాంపిటీషన్స్ నిర్వహించి వీటన్నిటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇదే పాఠశాలలో చదివి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన బీర సతీష్ పదివేల విలువచేసే స్పోర్ట్స్ టీషర్టులను విద్యార్థులకు వితరణ చేశాడు. గత 15 రోజులలో ఇంచార్జ్ ప ప్రధాన ఉపాధ్యాయులు ధర్మ ప్రకాష్ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ బృందం చక్కటి సమన్వయంతో చేస్తున్న కృషి వల్ల గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో ప్రవేశం పొందుతున్నారని ఉపాధ్యాయులంతా విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఎడ్యుకేషన్ గ్యారెంటీ ఇస్తున్నారని ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ మమత తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular