జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం మర్లబీడు గ్రామంలో
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు డిపిఆర్ఓ చెన్నమ్మ సూచనలతో
బుధవారం ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించి ఈవీఎంలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటర్లు వారు వేయాల్సిన పోలింగ్ బూత్ సంఖ్యను ముందుగానే తెలుసుకొని బూత్ లోకి వెళ్లి ఓటు వేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాటలు పాడుతూ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు కేశవులు, రమాదేవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.