జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు 9 నేషనల్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని రోజులుగా గ్రామ శివారులో జన సంచారం లేని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు ఇటిక్యాల ఎస్సై అశోక్ బాబు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ గ్రామానికి చెందిన మొండి బంగారం @మొండి జయన్న @మొండి శ్రీను తండ్రి సుంకన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనంతపూర్ జిల్లా, ముతుగుప్ప మండలం, కొడమల పల్లి గ్రామానికి చెందిన పొంతగిరి నాగార్జున తండ్రి పెంచలయ్య అనే వ్యక్తులు ఇటిక్యాల మండలం జింకల పల్లి గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి విగ్రహంపై ఉన్న వెండి కిరీటం( 45 తులాలు) హుండీలో ఉన్న 500 రూపాయలు దొంగిలించారు. గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి 10 -10-2023 న ఇటిక్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జిల్లాలోని గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండపల్లి, అనంతపూర్, దేవాలయాలు గట్టులోని అంబ భవాని దేవాలయం శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బూడిదిపాడు గ్రామ దేవాలయం మల్దకల్ గ్రామంలోని చింతల ముని దేవాలయం ఐజ పోలీస్ స్టేషన్ పరిధిలో తుత్తి నూన్ దొడ్డి గ్రామ దేవాలయం వనపర్తి జిల్లా మదనపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్ పాడు మైసమ్మ దేవాలయంలో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు శనివారం ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ఇటికాల పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ పై అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించగా వారిని పూర్తి స్థాయిలో విచారించడంతో దొంగలని తేలడంతో ఇటిక్యాల పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు
