Saturday, June 28, 2025

భారత్ మాల రోడ్డు నిర్మాణపు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలోని తప్పెట్ల మోరుసు, అరగిద్ద గ్రామంలో భారత్ మాల నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణతో కలిసి
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ పరిశీలించారు.
ఈ సందర్భంగా హైవే అథారిటీ అధికారులతో రహదారి నిర్మాణం సంబంధిత భూముల వివరాలను, భారత్ మాల రహదారి మ్యాపింగ్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా రైతుల భూములకు సర్వీస్‌ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోని సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన కనెక్టివిటీ అందిస్తామని అన్నారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరిత రాణి, ఎన్.హెచ్.ఎ.ఐ ఇంజినీర్ సురేందర్, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular