ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 2 :
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలోని అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం 120 కేజీల నకిలీ మొక్కజొన్న విత్తనాలు పట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు నర్సాపూర్ జి మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద 120 కేజీల నకిలీ మొక్కజొన్న విత్తనాలను బైంసా మండలం చాత గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం (TS 18 G 3971 )పై తీసుకుని వస్తుండగా అక్కడి రైతులు చంద్రకాంత్, శ్రీనివాస్ గమనించి నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని నిలదీయగా ఎలాంటి బిల్లు, రసీదు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులకు, మండల పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. సమాచారం అందిన వెంటనే వ్యవసాయ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి నకిలీ విత్తనాల పంచనామా నిర్వహించి పోలీస్ అధికారులకు అప్పగించామని తెలిపారు.
రసీదు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దు

నకిలీ విత్తనాల విషయమై జిల్లా వ్యవసాయ అధికారి అంజి కుమార్ ను చరవాణిలో సంప్రదించగా నకిలీ విత్తనాలను పంచనామా నిర్వహించి పోలీసు స్టేషన్లో అప్పగించడం జరిగిందని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు కచ్చితంగా దుకాణదారుడు వద్ద రసీదును, బిల్లును పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి గణేష్, రైతులు శ్రీనివాస్, విలాస్, భోజన్న, ప్రవీణ్, ముత్యం, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ మొక్కజొన్న పాకెట్లను చూయిస్తున్న వ్యవసాయ విస్తీర్ణ అధికారి

ఆగ్రహం వ్యక్తపరుస్తున్న రైతు శ్రీనివాస్ గుడిసెరా