Saturday, June 28, 2025

బ్రేకింగ్ న్యూస్….. తల్లి మృతదేహం ఖననం అక్కడే చేస్తాం..!

నిర్మల్ ,బైంసా ప్రధాన రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యుల ఆందోళన.

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన రాస్తారోకో, ఆందోళన

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 19 :

తమ సొంత భూమిని ఆక్రమించుకొని సమీప గ్రామంలోని వ్యక్తులు తన ముగ్గురు కుమారుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారంటూ తమ భూమిని తమకు ఇవ్వాలంటూ ఎడాదికాలంగా పోరాడుతున్న ఆ తల్లి శనివారం మధ్యాహ్నం మానసిక శోభకు గురై సమీపంలోని చెరువుల దూకి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణానంతరం తండ్రి పేరిట ఉన్న ఆ భూమిని తన పేరిట మార్చుకొని ముగ్గురు కుమారులకు సమాన భాగాలు చేసి పంచి పెట్టింది. అయితే ఒక కుమారుడికి సంబంధించిన భూభాగాన్ని సమీపంలోని ఓ గ్రామస్తులు ఆక్రమించుకొని ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మానస్థాపానికి గురైన నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం చాక్ గ్రామానికి చెందిన ముస్కు పోసాని (80) శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కుమారులు కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెతికి తీయించారు. ఉతగాధల వల్లనే తమ అమ్మ మానసిక శోభకు గురై ఆత్మహత్య చేసుకుందంటూ కుమారులతో పాటు కుటుంబ సభ్యులు మధ్యాహ్నం నుండి రాత్రి పదిన్నర గంటల వరకు ఆందోళన చేపట్టారు. తమ తల్లి మృతదేహాన్ని దేహాన్ని వివాదాస్పద భూభాగంలోనే ఖననం చేస్తామని మొండికేస్తూ నిర్మల్, బైంసా జాతీయ రహదారిపై సాయంత్రం నుండి రాత్రి 10:30 గంట వరకు బైఠాయించి ఆందోళన చేశారు. న్యాయమైన వీరి ఆందోళనకు తోడునీడగా పరిసర గ్రామస్తులు స్థానిక గ్రామస్తులు నిలిచారు. దీంతో వారి ఆందోళన ఉధృత రూపం దాల్చిన ఉందని గ్రహించిన నర్సాపూర్ జి ఎస్ ఐ హనుమాన్లు నిర్మల్ డిఎస్పి అల్లూరి గంగారెడ్డికి సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన నిర్మల్ రూరల్ సీఐ రామకృష్ణ, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ లతో పాటు తగిన సిబ్బందితో చాక్ పల్లి గ్రామానికి చేరుకున్నారు. సుమారు గంటన్నర పాటు ఆందోళనకారులతో మాట్లాడిన డిఎస్పి అల్లూరి గంగారెడ్డి వివాదాస్పద సమస్యకు పరిష్కారం కచ్చితంగా చూయిస్తామంటూ పక్కా భరోసా ఇవ్వడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనను విరమించారు.

రోడ్డుపై బైఠాయించిన కుటుంబ సభ్యులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular