Friday, June 27, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

ఓరుగల్లు9నేషనల్ టీవీ :దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఆలయాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు.భద్రాచలం, రామప్ప, జోగులాంబ, బల్కంపేట ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వెయ్యి స్తంభాల మండపంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.

”దేశ వ్యాప్తంగా 150 దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. ఇప్పుడు యువత కూడా పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతోంది. పెద్దలపై గౌరవం, దేశభక్తి, సమాజంపై బాధ్యత పెంచుకోవాలి. మరింత అంకితభావం, చిత్తశుద్ధితో దేశాభివృద్ధికి కృషి చేస్తాం. మోదీ ప్రభుత్వ హయాంలోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం” అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular