ఓరుగల్లు9నేషనల్ టీవీ :లోక కళ్యాణార్థమై ఓరుగల్లు లోని అతి ప్రాచీనదేవాలయమైన కాకతీయుల ఆరాధ్యదైవం శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా జ్యోతి ప్రజ్వలనతో పశ్చిమ నియోజక శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి-నీలిమ దంపతుల చే ఆరంభించి దేవాలయ వేదపండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని వైదిక బృందం చే విశేష సంకల్పం,వేదపారాయణ,చండీపారాయణ సంకల్పం తో చండీ హోమం ప్రారంబించబడినవి.
ఇట్టి ఉత్సవాలకు విచ్చేసిన శాసన సభ్యులు అమ్మవారిని దర్శించి దేవాలయం ఇంకా అభివృద్ది కోరకై వ్యక్తి గతంగా సహకారం అందిస్తానని దేవాలయ అర్చకులు అమ్మవారి శేష వస్త్రం తో సత్కరించి ఆశీర్వచనాన్ని అందిచడం వారి వెంట 10 వ డివిజన్ కార్పోరేటర్ తోట వేంకటేశ్వర్లు దేవాలయ అభివద్ది కార్యకర్త ముక్కా ప్రకాశ్ రాజ్కుమార్ మాదాసుమోగిలయ్య,సదానందం,సంతోష్ పండితులు పాల్గోన్నారు
