Saturday, June 28, 2025

నిర్మల్ జిల్లా పరిధిలో డీజే వినియోగంపై నిషేధం

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 3 :

నిర్మల్ జిల్లా పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఐఎఎస్ , జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్. ఉత్తర్వులు జారీ చేశారు.

డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతే కాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై నిర్మల్ జిల్లాలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే పోలీసు ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ప్రజలకు, విధుల్లో ఉండే అధికారులకు కలుగుతున్న ఇబ్బందులు, తలెత్తున్న సమస్యలను విశ్లేషించి అందరీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular