ఓరుగల్లు9నేషనల్ టీవీ : వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజి వాకడే, అదనపు కలెక్టర్ జి.సంధ్య రాణి, గార్లతో కలిసి జిల్లాలో ఉన్న చెరువు ఎఫ్టీల్,బఫర్ జోన్ ల పై సంబంధిత అధికారులతో సమీక్షించడం జరిగింది.
ఈ సమీక్ష లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చెరువుల ఆక్రమణలకు గురి అయి వర్షం నీటి నిలువ చెరువులు నిండి ప్రజల నివాస ప్రాంతాల్లో నీరు చేరుకుని ప్రజల జీవన విధానానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చెరువుల బఫర్ జోన్ , ఎఫ్టిల్ పరిధులను పరిశీలించుటకు ఇరిగేషన్ అధికారులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, వివిధ మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.