Friday, June 27, 2025

తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల: ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం tgdsc.aptonline.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. పరీక్షలు ముగిసిన 56 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. 11 వేల 62 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దసరా లోపు తుది నియామకాలు చేపడతామని ప్రకటించారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. పదేళ్లలో ఒకేఒక్కసారి టీచర్ నియామకాలు చేశారని సీఎం రేవంత్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పదేళ్లలో 7 వేల టీచర్ పోస్టులే భర్తీ చేశారని, గత సర్కార్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రేవంత్ విమర్శించారు. అతి తక్కువ టైంలో 11 వేల 62 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఆయన తెలిపారు. 2 వేల 629 పోస్టుల భర్తీ, 6 వేల 508 SGT పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular