ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29:
నర్సాపూర్ (జీ) మండల లోని గుండం పల్లి x రోడ్డు వద్ద ట్రైని ఎస్సై యం అజయ్ , ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ధృవపత్రాలు లేని వాహనాలకు ఫైన్ విధించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. వాహనాలు నడుపుతూ మైనర్ లు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది కృష్ణ చౌహాన్, పిసి మోహన్, పాల్గొన్నారు.

వాహనదారునికి సూచనలు ఇస్తున్న ట్రైన్ ఎస్సై యం అజయ్