Saturday, June 28, 2025

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి నుండి సన్నబియ్యం పంపిణీపై తెలంగాణ సర్కార్ గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్​వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్రంలో 25 లక్షల టన్నుల మేర సన్న బియ్యం డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పడింది. ఇప్పుడు సన్నాల సాగు పెరగడంతో డిమాండ్ కు సరిపడా సరఫరా మన రాష్ట్రంలోనే ఉండనుంది. గతంలో డిమాండ్ కు తగ్గట్టు సన్న బియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించి సన్నాల సాగును ప్రోత్సహించడంతో ఈసారి 36.80 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. తద్వారా 88 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్చి రేషన్​లో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

రాష్ట్రంలో 80 శాతానికి పైగా కుటుంబాలు సన్న బియ్యమే తింటున్నాయి. సన్న వడ్లకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించలేదు. గతంలో 25 నుంచి 30 శాతానికి మించి సన్న వడ్ల సాగు జరగలేదు. రైతులు కొన్నేండ్లుగా 20 లక్షల ఎకరాలకు మించి సన్నాలు సాగు చేయలేదు. మూడేండ్ల కింద అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సన్న వడ్లు వేయాలని, బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ తర్వాత అమలు చేయలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular