ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 9 :
నర్సాపూర్ జి మండలం చాక్పెల్లి గ్రామపంచాయతీ చెత్త తీసుకువెళ్లే ట్రాక్టర్ (B. NO. TS18-D-4410) బ్యాటరీ దొంగతనం జరగగా పంచాయతీ కార్యదర్శి నరేష్ కుమార్ తేదీ 27.06.2024 రోజున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా విచారణలో భాగంగా సోమవారం మహారాష్ట్ర హిమాయత్ నగర్ కు చెందిన వ్యక్తి బ్యాటరీ దొంగలించగా సదరు నిందితుడిని అరెస్టు చేసి జిల్లా న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్లు ఎస్సై హనుమాన్లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.