ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి,జులై 18:
నర్సాపూర్ (జి): నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని నీలిమ వైన్స్ లో దొంగతనం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన విరాళ ప్రకారం బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు వైన్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి సిసి కెమెరాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న మూడువేల రూపాయల నగదు రూ. 12,300 మద్యం ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. గురువారం ఉదయం వైన్స్ సేల్స్ మ్యాన్ వసంత్ రెడ్డి కు రాగా షట్టర్ తాళాలు పగిలి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఏఎస్ఐ మాన్సింగ్ వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెల్ల కళ్లు దుకాణంలో చోరి
నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని తెల్ల కళ్ళు దుకాణంలో చోరీ జరిగిందని ఏఎస్ఐ మాన్సింగ్ గురువారం తెలిపారు బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తెల్ల కళ్లు దుకాణంలోకి చొరవ పడి సిసి కెమెరాల ధ్వంసం చేసి రూ. 610 నగదు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నారు.
