ఓరుగల్లు9నేషనల్ టీవీ :పుస్తకాల్లో చదువులకు, బయట మార్కెట్ లో సమాజానికి ఏమాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకాడమిక్ సిలబస్ లు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పట్టాలు తీసుకుంటున్నారే తప్పా.. వారిలో పనితనం ఉండట్లేదని ఆయన అన్నారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీ పడే విదంగా టెక్నికల్ కోర్సులు సిలబస్ మారాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వానికి భేషజాలు లేవు, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఉంటుందని అన్నారు. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానమని వివరించారు.
ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లు మాత్రమేనని. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రస్తుతం కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజెంట్ సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీగా ఉందని. ఆ తర్వాతే అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్ – 2024 లోగోను విడుదల చేశారు.
JNTU ఏటా లక్షమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ ఔవుట్ అవుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫాక్టరీలుగా ఉండకూడదని సూచించారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. ఈ అకాడమిక్ ఈయర్ నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్ చెల్లిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో నాడు IDPL ను ఇందిరా గాంధీ పెట్టడం వల్లే నేడు ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు.