ఓరుగల్లు9నేషనల్ టీవీ :మడికొండ,హనుమకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు గెలిసి,కాంగ్రెస్ జెండాను గ్రామ గ్రామాన రిపేరెలాడిచాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు.శనివారం నాడు మడికొండ, సత్య సాయి కన్వెన్షన్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ – అభినందన సభకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎంపీ డా. కడియం కావ్య కి గజమాలతో ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఎంపి కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ ను ఇండస్ట్రియల్ కారిడార్, ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.

మడికొండ, సత్య సాయి కన్వెన్షన్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభకు వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓరుగల్లు కోట నుండి ఎర్రకోటకు తనను పంపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించిన వర్ధన్నపేట ప్రజలకు ఋణపడి ఉంటానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. నరేంద్ర మోడీ ఓటమి భయంతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

పాలనలో కాళ్లు విరిగిన మోడీ ఒక వైపు నితీష్ కుమార్ మరో వైపు చంద్రబాబు చేతి కర్రల సహాయంతో మోడీ నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనుల గడవు మరికొంత కాలం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి కేంద్రాన్ని కోరడంతో గడువు పెరిగిందని తెలిపారు.

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు 24 గం. లు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ఆయిల్ సీడ్స్ సంస్థ చైర్మన్ జంగా రాఘవరెడ్డి , హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, హనుమకొండ జిల్లా కోసాన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, వరంగల్ జిల్లా కిసాన్ అధ్యక్షులు దేవేందర్, ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.



