ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి,జులై 11:
నర్సాపూర్ (జి): నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని స్థానిక కొచ్చేరువు దగ్గర గురువారం రాత్రి పేకాట ఆడుతున్నారన్న రహస్య సమాచారం మేరకు గ్రామంలోని కొచ్చెర చెరువు సమీపంలో పేకాట స్థావరంపై ఎస్సై హన్మాండ్లు ఆధ్వర్యంలో దాడి చేయగా ఇద్దరు జూదరులు పట్టుబడగా, మరో ఇద్దరు జూదరులు పారిపోయారు. వీరి వద్దనుండి రూ1050 నగదు , 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హన్మాండ్లు పేర్కొన్నారు. వీరిపై పెట్టికేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హన్మాండ్లు హెచ్చరించారు