Saturday, June 28, 2025

గుట్కా అక్రమంగా విక్రయిస్తే కేసులు తప్పవు

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి,జులై 9:

ప్రభుత్వం నిషేధించిన గుట్కా అక్రమంగా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని నర్సాపూర్ (జి) ఎస్సై హన్మండ్లు హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ (జి) మండలం లోని అర్లి-కే గ్రామం లో తెలంగాణ ప్రభుత్వం నిషేధిత గుట్కా అమ్ముతున్నారని పక్క సమాచారంతో పోలీసులు పలు దుకాణాలపై దాడులు చేపట్టారు. సందే వినాయక్ s/o లక్ష్మణ్, శ్రీరామ్ సురేష్ s/o ఎల్లన్న లను నర్సాపూర్ (జి) తహసిల్దార్ శ్రీనివాస్ ముందర బైండోవర్ చేశారు. మండలంలో మాదకద్రవ్యాల నిర్మూలన, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నట్టు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై తో పాటు షాహిద్, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular