జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ:- ప్రతినిధిజోగులాంబ గద్వాల జిల్లా : తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతరేవుల యం. కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం 2022 నుంచి నేటి వరకు ఉన్న పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల ఫైల్స్ ఏఎల్ఓలో ఉన్నా పట్టించుకోకుండా లేబర్ ఆఫీసర్ కార్యాలయంకి రాకుండా కాలయాపన చేస్తున్నారని, లేబర్ ఆఫీసును తక్షణమే కలెక్టరేట్ ఆఫీసులోకి మార్చాలని, లేబర్ ఆఫీస్ ఇక్కడ ఉండటం వలన అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాయంత్రం 4 గంటలకు వచ్చి ఫైల్స్ తీసుకొని వెళ్తున్నాడని తెలిపారు. లేబర్ ఆఫీస్ లో ఉన్న కొంతమంది అధికారులు తమ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఫైల్స్ పోగొట్టి మల్లి కార్మికులకు ఫోన్ చేసి అన్ని ఫైల్స్ తీసుకొని రావాలని బెదిరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా లేబర్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ను మార్చి వారి స్థానంలో వేరే వాళ్ళని పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఏఎల్ఓని బదిలీ చేయాలని అన్నారు. అలాగే లైన్ పద్ధతిలో క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయన ఏసీఎల్ లేబర్ అధికారి వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ, ఇతర నిర్మాణ సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తిక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంజిపేట కోళ్ల అంజి, తనగల ప్రేమ రాజు, దుబ్బన్న, తిమ్మన్న, రమేష్ కుమార్, నరసింహులు, బీసమ్మ, ఇంద్రమ్మ, భాస్కర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలి-లేబర్ అధికారి వెంకటరమణకి వినతిపత్రం అందజేత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES