Saturday, June 28, 2025

భక్తులతో కిక్కిరిసిన జమ్ములమ్మ ఆలయ ప్రాంగణం ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:-
జోగులాంబ గద్వాల జిల్లా : జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తులు జములమ్మ తల్లీ కరుణించవమ్మా.. అంటూ భక్తిభావంతో ఊగిపోయారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బైనోళ్లు, కుర్వడోళ్ల చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో జములమ్మ తల్లీ.. దీవనలు ఇవ్వమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని కొలిచారు. సాయంత్రం వరకు దాదాపు 20వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో పురేందర్ తెలిపారు. ఆలయ చైర్మన్‌ సతీష్‌కుమార్‌ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గద్వాల రూరల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular