Friday, June 27, 2025

BRS పార్టీ కి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.-ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్-ఓరుగల్లు9నేషనల్ టివి

ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి:-బాల సముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో భారత రాష్ట్ర సమితి వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది సహజం అని,ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.ప్రజల తీర్పును గౌరవిస్తామని, ప్రజల పట్ల నిబద్ధతతో ఉంటామని, కాంగ్రెస్ పార్టీ అమలు కానీ ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజల్ని మోసం చేస్తుందని అన్నారు.ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ ని చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తూ, వారి ఓట్లను దండుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత హామీలతోపాటు డబ్బులను కూడా పంపిణీ చేసి ఎన్నికల్లో గెలిచిందని అన్నారు.

ప్రజల తీర్పును శిరసా వహిస్తానని, రానున్న రోజుల్లో తిరిగి బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. 64 మంది ఎమ్మెల్యేలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైందని ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో, ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎంపీగా గెలుపొందిన మల్కాజిగిరిలో సైతం బిజెపి అభ్యర్థులు గెలిచారంటే సీఎం పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. 6 గ్యారంటీలో 13 అంశాల్లో ఐదు హామీలను నెరవేర్చకుండానే నెరవేర్చిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఇంకా ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధి ఆక్షేపణ లేకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ విజయ డంకా మోగించిందని అన్నారు. ఇది కూడా సీఎం జిల్లా కావడం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ని సైతం ఓడిపోవడం జరిగిందని అన్నారు.

ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా కలిసి 15 ఎంపీలను గెలుస్తామని చెప్పినటువంటి వారు 8 సీట్లు గెలిచారని, వారి అంచనాలు తలకిందులు అయ్యాయని అన్నారు. బిజెపి పార్టీ కూడా దేశవ్యాప్తంగా అనుకున్న స్థానాలు గెలవలేక పోయిందని, బిజెపిపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే పార్లమెంట్ స్థానాలు భారీగా తగ్గాయని అన్నారు.ఎన్ డి ఎ కూటమి లోని పార్టీలతో జతకట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మరొకసారి కాబోతున్నారే తప్ప, 400 సీట్లు గెలుస్తామన్న బిజెపి గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేదని అన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు జాతీయ పార్టీలను చూసి ఓటేసారని అన్నారు.అయినా కానీ వరంగల్ లోక్ సభ స్థానంలో సుమారు రెండు లక్షల 30 వేలు ఓట్లు బి ఆర్ ఎస్ పార్టీకి రావడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని,చిహ్నాల మార్పుల పైన,తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పైన దృష్టి పెట్టకుండా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్,బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడతల సారంగపాణి,నార్ల గిరి రమేష్, నయీముద్దీన్,చింతం యాదగిరి ,సయ్యద్ మసూద్, బండి రజనీ కుమార్,జోరిక రమేష్ పోలపల్లి రామ్మూర్తి,చంద్రమోహన్, సల్వాజి రవీందర్ రావు,రమేష్, కుసుమ లక్ష్మీనారాయణ, ఖలీల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular