వైద్యుల నిర్లక్ష్యం వలన బలైపోయిన వాణి
ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీశారు అంటూ బంధువుల ఆరోపణ

ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి:-వరంగల్ వెంకట్రామ టాకీస్ సమీపంలోని సంరక్ష హాస్పిటల్ లో రోజురోజుకీ మరణాల సంఖ్య పెరుగుతుంది అనడానికి నిదర్శనంగా మరోసారి వాణి అనే యువతీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు,

వివరాల్లోకెళ్తే వాణి (42) అనే యువతీ గత కొద్ది సంవత్సరాలుగా సంరక్ష హాస్పిటల్ లోనే పని చేసేది, కొన్ని సంవత్సరాల తర్వాత వానికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసి ఆమె పనిచేస్తున్న సంరక్ష హాస్పిటల్ లోనే తన కుటుంబం అడ్మిట్ చేయడం జరిగింది, ఆపరేషన్ సమయంలో డాక్టర్లు కిడ్నీని తొలగించారు కిడ్నీతోపాటు కిడ్నీకానుకొని ఉన్న కొన్ని నరాలు కట్టవడం తో వాణి తీవ్ర ఆ స్వస్థతకు గురైనట్టు గుర్తించిన డాక్టర్లు ఆమెని హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి పంపించారు, బంధువులు ఆందోళన చేయగా డాక్టర్లు మా నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది కాబట్టి మేమే సహాయం చేస్తామంటూ బంధువులకు మాయమాటలు చెప్పి పంపించేశారు, అడ్మిట్ చేసినప్పుడు సంరక్షహాస్పిటల్ యాజమాన్యం కొంత డబ్బుని యశోద హాస్పిటల్ వారికి కట్టడం జరిగింది, మిగతా డబ్బును కట్టే క్రమంలో సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం ద్వారా వానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ని ఆపేశారు దానితో వాన్ని మృతి చెందింది అని వాణి కుటుంబానికి ఆరోపించారు న్యాయం చేయాలని చితి పేర్చి బంధువులు సంరక్ష హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు.


