జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : ధరూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రయివేటు క్లినిక్లని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ, ఉప వైద్యాధికారి డాక్టర్ సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్రవంతిలు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ధరూర్ గ్రామంలో కంసలి శ్రీనివాసులు నడుపుతున్న క్లినిక్ లో చిన్నపిల్లలకు సెలైన్ బాటిల్ ఎక్కించడం, హై డోస్ యాంటీబయోటిక్ మందులు ఇవ్వడం చేస్తున్నారని గుర్తించి ఇది చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడడం అని, సహించరాని నేరం అని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ ను నడపడమే క్వాలిఫై డాక్టర్ లేకపోవడం, బయో మెడికల్ వేస్టేజ్ సైతం లేకపోవడాన్ని గుర్తించామని అన్నారు. బయో మెడికల్ వేస్టేజ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజలకు వాడిన సూదుల వలన ప్రమాదకరమైన ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, అలాగే పర్యావరణం కూడా కలుషితం అవుతుందని భావించి క్లినిక్ ని తాత్కాలికంగా మూసి వేశారు. అయితే క్లినిక్ ని మూసివేసే క్రమంలో మహిళ అధికారులని చూడకుండా క్లినిక్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఈ క్లినిక్ ను నడుపుటకు ఎలాంటి అనుమతులు లేనందున తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో చాకలి శ్రీనివాసులు నిర్వహించే క్లినిక్ ను తనిఖీ చేయగా ఈ క్లినిక్ కి కూడా ఎలాంటి అనుమతులు లేవని గుర్తించామని, అంతేకాకుండా ఈ క్లినిక్ ప్రథమ చికిత్స కేంద్రంలా కాకుండా ప్రయివేటు ఆసుపత్రి తరహాలో ఉండడంతో, రెండు క్లినిక్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న క్లినిక్లని తనిఖీ చేసిన వైద్యాధికారులు-అనుమతులు లేకపోవడంతో క్లినిక్ల మూసివేత-నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవు-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES