పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా సంధ్యారాణి, డిసి పి రవీందర్, డి ఆర్ ఓ శ్రీనివాస్ లతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష.

ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పక్కడ్బందీ నిర్వహణకు దిశా నిర్దేశం.
ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి వరంగల్:-లోకసభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో ఎటువంటి లోటుపాట్లకు తావీయరాదని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
జూన్ 4వ తేదీన
నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నేపధ్యంలో
గురువారం ఏనుమామూల మార్కెట్ యార్డులో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా సంధ్యారాణి, డిసిపి రవీందర్, డి ఆర్ ఓ శ్రీనివాస్ లతో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను ఏనుమముల మార్కెట్ యార్డ్ లో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మూడంచెల భద్రత వ్యవస్థ, వాహనాల పార్కింగ్, మళ్లింపు, బారికేడింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, ఎన్నికల సిబ్బందికి కౌంటింగ్ ఏజెంట్లకు భోజనం, నిరంతరాయ విద్యుత్ సరఫరా, వైద్యం, మొబైల్ అంబులెన్స్ అందుబాటులో ఉంచడం, అగ్నిమాపక నివారణ పరికరాల, వాహనాల ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించి పక్కడ్బందీ నిర్వహణకు
దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూఎన్నికల కౌంటింగ్

కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలన్నారు. గుర్తింపు కార్డులు కలిగిన సిబ్బంది, వ్యక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని. ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్దనే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే సంబంధిత రాజకీయ పార్టీల ఏజెంట్లకు కూడా గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించే వారికి సెల్ఫోన్ అనుమతి ఉండదని, ముందుగానే సెల్ఫోన్ డిపాజిట్ చేసి రసీదు పొందాలని తెలిపారు. జూన్ 4 ఉదయం ఎనిమిది గంటలకు ఓట్లు లెక్కింపు పక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి రౌండ్కు లెక్కింపు వివరాలను డిస్ప్లే బోర్డు నందు ప్రదర్శించడంతోపాటు, ఎన్ కోర్ నందు అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు.. లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి సీల్ వేస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు, ప్రజలు ఓట్లు లెక్కింపు సజావుగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు.
ఏనుమాముల మార్కెట్ యార్డులో ఏర్పాట్ల పరిశీలనబ్క్షేత్ర స్థాయిలో
అనంతరం ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించనున్న వరంగల్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పి ప్రావిణ్య, సిపి అంబర్ కిషోర్ ఝా, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా సంధ్యారాణి, డిసిపి రవీందర్, డి ఆర్ ఓ శ్రీనివాస్ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారదర్శకతతో కూడిన ఏర్పాట్ల విషయంలో ఖచ్చితత్వం పాటించే విధానంలో చేపట్టవలసిన వాటిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం విజిటర్స్ రిజిస్టర్ లో వారు సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ, జిడబ్ల్యూ ఎంసీ, ఆర్ డబ్ల్యూ ఎస్, ఆర్ అండ్ బి, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, ఎన్ పి డి సి ఎల్,తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు