ఓరుగల్లు9నేషనల్ టీవీ నిర్మల్: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని భామ్ని (బి) అడవి ప్రాంతంలో నర్సాపూర్ జి గ్రామానికి చెందిన కొందరు యువకులు అడవి ప్రాంతంలో ఫోటోలు మరియు వంట వార్పు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, శుక్రవారం రోజు యువకులు ఫోటోలు దిగే క్రమంలో వారికి అక్కడ అనుమానాస్పదంగా ఎడమ కాలిపై గాయాలతో మృతి చెంది ఉన్న చుక్కలు దుప్పిక కనిపించింది, వారు భయంతో ఎవరికి తెలియజేయాలో తెలియక నర్సాపూర్ జి గ్రామానికి చెందిన కొందరు యువకులకు చెప్పడంతో వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు చెప్పడం జరిగింది, ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సోమవారం రోజు ఘటన స్థలాన్ని వెళ్లి పరిశీలించారు మృతి చెందిన చుక్కలు దుత్తిని పొదలకి లాక్కెళ్ళి అటవీ జంతువులు తిన్న ఆనవాళ్లు కనిపించాయి, ప్రమాదవశాత్తు గాయమై చనిపోయిందా మరి వేటగాళ్ల ఉచ్చులో పడి చనిపోయిందా తెలియాల్సి ఉంది,
ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యువకులను ఫారెస్ట్ అధికారులు పిలిపించి వారితో చనిపోయిన దుప్పిక యొక్క ఫోటోలు వీడియోలు తీసినందుకు తప్పయింది అని లిఖితపూర్వకంగా పేపర్ పైన రాసుకుంటున్నారు