Saturday, June 28, 2025

గద్వాల మండల ఆర్ఐని విధుల నుంచి తొలగించాలంటు కలెక్టర్ కి వినతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాల మండల ఆర్ఐగా పనిచేస్తున్న సుదర్శన్ ని విధుల నుంచి తొలగించి ఆ స్థానంలో ఇతర అధికారిని నియమించాలని కోరుతూ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఆర్. ఇమ్మానియేల్ జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ని కోరారు. దీనిపై ఆయన శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇమ్మానియేల్ మాట్లాడుతూ గద్వాల మండల ఆర్ఐగా రెండు నెలల కింద బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గద్వాల తహసీల్దార్ కార్యాలయానికి రావడం లేదని, దీంతో మండలంలోని రైతులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటం, వచ్చే నెల పాఠశాలలు, కళాశాలలు పున:ప్రారంభం అవుతుండడం, ఇటీవల నూతనంగా వివాహాలు చేసుకున్న వారికి ఆర్ఐ సంతకం కావాల్సి ఉండగా, ఆయన కోసం తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా అక్కడి సిబ్బంది ఈరోజు అధికారి రాలేదని చెప్పడం, ఫోన్ చేస్తే అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు చేసేది లేక వెనుదిరిగి వెళ్లడం పరిపాటిగా మారిందని, ఈ తంతు ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరుగుతుందని పేర్కొన్నారు. కావున దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి అధికారిని విధుల నుంచి తొలగించి ఆయన స్థానంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిని నియమించి ప్రజల ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రహీం, శీను, రాముడు, వెంకట్రాములు, బాలరంగడు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular