జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ సభ్యులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు బాధితులకు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నారు. హైదరాబాద్లోని బాలాపూర్ జనప్రియ కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న సిద్దు తిరుపతి కొంతకాలం కింద జరిగిన ప్రమాదంలో కూడి కాలును పూర్తిగా తొలగించగా, ఎడమ కాలు కూడా ఫ్యాక్చర్ అయి ఇంటికే పరిమితం అయ్యారు. ఈయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు. కాగా పెద్ద అమ్మాయి ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చదువుతుండగా, చిన్న అమ్మాయి 10వ తరగతి పూర్తి చేసింది. భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ప్రస్తుతం పెద్ద అమ్మాయి కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఆర్థిక సహాయం కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమును కోరడంతో వెంటనే వారింటికి వెళ్లి రూ. 35వేలు అందజేశారు. అలాగే హైదరాబాద్లోని బాలాజీ నగర్, వీరభద్ర కాలనీకి చెందిన అజయ్ కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కారు డ్రైవర్ గా పనిచేస్తున్న క్రమంలో గత సంవత్సరం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పక్షవాతం వచ్చి కాళ్ళు, చేతులు పడిపోయాయి. దీంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, కుటుంబ పోషణ నిమిత్తం నిత్యావసర సరుకులు ఇప్పించమని కోరడంతో వారికి రూ.22వేలు విలువ గల నిత్యావసర సరుకులు ఇప్పించి ఆదుకున్నారు. ఈ సందర్భంగా వారు సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులు జబ్బీర్, భాస్కర్, యుగంధర్ రెడ్డి, బెంజిమెన్, ప్రసాద్, విలియం కేరి, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం అందజేసిన సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES