జోగులమ్మ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి అండగా నిలిచి గద్వాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం అని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్ పర్సన్ బండ్ల లక్ష్మీ దేవమ్మ కోరారు. శుక్రవారం ఆమె ధరూర్ మండలంలోని బూరెడ్డిపల్లె, ఓబులోనిపల్లి, మార్లబీడు, కోతులగిద్దె గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలుసుకుని
ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి మల్లు రవిని గెలిపించాలని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర 5 గ్యారెంటీల గురించి ప్రజలకు వివరిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించి గద్వాల నియోజకవర్గాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, బండ్ల ఆనంద్ రెడ్డి, మహేష్, కోతులగిద్ద మాజీ సర్పంచు రంగన్న, కరెప్ప, ధరూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మల్లు రవికి ఓటేద్దాం…గద్వాలను అభివృద్ధి చేసుకుందాం-గద్వాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్ పర్సన్ బండ్ల లక్ష్మి దేవమ్మ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES