Friday, June 27, 2025

ఆర్ఎస్పీ వెంటే గద్వాల జిల్లా ప్రజలు-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే గద్వాల జిల్లాను రద్దు చేయడం ఖాయం-పార్లమెంటులో ప్రశ్నించే గొంతును గెలిపించి, తెలంగాణ ప్రయోజనాలకు కాపాడాలి-ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ని గెలిపిద్దాం..జిల్లాను అభివృద్ధి చేసుకుందాం ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బలపర్చిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి, డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ వెంటే ఉన్నారని, ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా శుక్రవారం గద్వాల పట్టణం లోని14,15, 29వ వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, గద్వాల నియోజకవర్గం కేసీఆర్ పాలనలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాలోని అలంపూర్ వాసి అయిన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ దళిత జాతిలో పుట్టి మాజీ ఐపిఎస్ అధికారిగా, కేసీఆర్ పాలనలో గురుకులాల కార్యదర్శిగా పని చేసి10లక్షల మంది నిరు పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం, ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. మన ప్రాంతం బిడ్డ, చదువుకున్న వ్యక్తి, భవిష్యత్తులో మన పిల్లలు కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా కృషి చేసే నాయకుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తెస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆరు గ్యారెంటీలు అంటూ వారంటీ లేని పథకాలు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వతాతలకు రూ. 4 వేల పింఛన్, మహిళలకు రూ. 2500లు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్ సిలిండర్లు, రైతులకు రైతుబంధు, బోనస్ గా రూ. 500లు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలో ఎవరు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ప్రాధాన్యత కల్పించి దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళిత బంధు పథకం గురించి కనీస ఆలోచన చేయడం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. ఇక బీజేపీ పార్టీ మతం పేరుతో, జై శ్రీరామ్ నినాదంతో ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చులు పెట్టడం జరుగుతుందని, బిజెపి వాళ్లు మాత్రమే హిందువులేనా మేము కూడా హిందువులమే, మేము ప్రతిరోజు దేవుని మొక్కుతాం, అన్ని మతాలను గౌరవిస్తాం అని అన్నారు. ప్రధాని మోడీ అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్ శక్తులకు మేలు చేసి వారు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేద ప్రజలపై పెనుభారం మోపుతూ ధరలు పెంచి పేదల బతుకులను ఆగం చేశారని, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలిస్తే ఎన్నికలు ముగిసిన వెంటనే గద్వాల జిల్లాను రద్దు చేయడం ఖాయమని అన్నారు. అందుకే మల్లు రవిని గెలిపించి కొట్లాడి సాధించుకున్న జిల్లాను రద్దు చేసుకుందామా లేక ప్రశ్నించే గొంతుక అయిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ని గెలిపించి జిల్లాను అభివృద్ధి చేసుకుందామా అని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం, గద్వాల జిల్లా అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లల భవిష్యత్ మారాలన్నా విద్యావంతుడు, సమస్యలపై అవగాహన ఉన్నోడు, ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీసే రాజకీయ చతురత కలిగిన మన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, మాజీ ఛైర్మన్ వేణుగోపాల్, గద్వాల టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు, గద్వాల టౌన్ పార్టీ యూత్ అధ్యక్షుడు గంజిపేట మధు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular