Saturday, June 28, 2025

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించుకుందాం-కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గద్వాల నియోజక వర్గంలోని ధరూర్ మండల కేంద్రంలోని బండ్ల చంద్రశేఖర్ రెడ్డి బీసీఎస్ఆర్ కాంప్లెక్స్ లో ధరూర్, కేటిదొడ్డి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి పీవీ. మోహన్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ధరూర్, కేటిదొడ్డి మండలాల నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని సూచించారు. మల్లు రవిని అధిక మెజారిటీతో గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీని అధిష్ఠానం ఎక్కించాలని, అందుకోసం ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయించి మల్లు రవిని పార్లమెంటుకు పంపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మెన్ బండారి భాస్కర్, ధరూర్ మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ర్యాలంపాడు నరేందర్ రెడ్డి, జాకీర్, పాతపల్లెం శ్రీనివాసులు, ప్రహ్లాద్, ధరూర్ ఉప సర్పంచ్ సవరన్న, నాగన్న, దేవన్న, రాంరెడ్డి, రాజారెడ్డి, గుడెందొడ్డి నర్సింహులు, ధరూర్, కేటి దొడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular