Saturday, June 28, 2025

మల్లు రవితోనే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి-గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇమ్మానియేల్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత ఆదేశానుసారం గురువారం గద్వాల పట్టణంలోని 6వ వార్డులో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఆర్. ఇమ్మానియేల్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మానియేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, గద్వాల నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఎంతైనా ఉందన్నారు. దేశ అభివృద్ధి సైతం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని, రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారెంటీలు, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన అయిదు గ్యారెంటీలు పేద, బడుగు బలహీన, ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవని తెలిపారు. అందుకే మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ గద్వాల తాలుక కార్యదర్శి జంగంపల్లి శ్రీను యాదవ్, రాము, భాస్కర్, వినోద్, జమ్మిచేడు రవి, కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular