జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా గురువారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్ పర్సన్ బండ్ల లక్ష్మీ దేవమ్మ ధరూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా లక్ష్మీ దేవమ్మ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించి పార్లమెంటుకి పంపించాలని, మల్లు రవి ఎంపీ అయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తారని, గద్వాల జిల్లా అభివృద్ధి కూడా మల్లు రవితో సాధ్యమవుతుంది అన్నారు. అనంతరం ఈ నెల13 జరిగే పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి గెలవాలని కోరుతూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి రామన్న, లేవన్న, బుగ్గన్న, మాల కిష్టప్ప, ధరూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ మాజీ చైర్పర్సన్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES