Saturday, June 28, 2025

ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం-గద్వాల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బాలసదన్ నందు పండ్లు పంపిణీ-హాజరైన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ జయంతి, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జోగులాంబ గద్వాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బాల సదన్ చిన్నారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్వాల పట్టణ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గంట కవిత హాజరై హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం బాలసదన్ లోని అనాధ విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంటా కవిత మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గడిచిన రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత, నేడు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక సేవకు పునరంకితం కావడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈరోజు హెన్రీ డునాంట్ జయంతి సందర్భంగా గద్వాలలోని బాలసదన్ నందు అనాధ పిల్లలతో గడిపి, వారికి పండ్లను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని, రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఇంకా గద్వాల జిల్లాలో పురోగతి చెందాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక నివేదికను సీనియర్ సివిల్ జడ్జితోపాటు అధికారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జి. రమేష్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ మోహన్ రావు, జిల్లా శిశు సంరక్షక అధికారి నరసింహ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యాలయ అధికారిని శోభ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular