జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని యువజన కాంగ్రెస్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి బీఆర్. ఇమ్మానియేల్ అన్నారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత ఆదేశానుసారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బిఆర్. ఇమ్మానియేల్ మాట్లాడుతూ నాగర్కర్నూల్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన డాక్టర్ మల్లు రవి అత్యధిక మెజార్టీతో గెలావబోతున్నారని, ఆయనకు 59 ఎస్సీ ఉప కులాల మద్దతుతోపాటు బడుగు బలహీన వర్గాల ప్రజలు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎంపీగా మల్లు రవి విజయం సాధించి, నాగర్ కర్నూల్ పార్లమెంట్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. గత10సంవత్సరాల బిజెపి పాలనలో దళితుల కోసం ఏమి చేసింది లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేస్తామని పదేళ్లు ఉండి ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధికి ఏమి చేసిందని ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ప్రజలందరు ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం పదేళ్లు పాలించి దళితులు, రైతులు, సామాన్య ప్రజలకు ఏమి చేసిందని ఆలోచించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకొని ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి డాక్టర్ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గద్వాల నియోజక వర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు పాలెం శ్రీను యాదవ్, ధరూర్ రవి, మొద్దలకుంట రాముడు, పెద్దపల్లి శివ, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తాం-ఎస్సీ ఉపకులాల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్ధి మల్లు రవికే-యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఆర్. ఇమ్మానియేల్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES