జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు రవి, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మధ్య తీవ్ర పోటీ ఉన్నా…ఆర్ఎస్పీ వైపే గాలి ఎక్కువగా వీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సారి జరుగుతున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పార్టీలను చూడకుండా అభ్యర్థుల మనస్తత్వం, మంచి మనస్సు, ఆదుకునే గుణాన్ని చూస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్థులు, రాజకీయ మేధావులు మాత్రం మాజీ ఐపీఎస్ అధికారి, స్థానికుడైన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ వైపే చూస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి జరగాలన్నా, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన పరిష్కారం కావాలన్నా అది ఒక్క ప్రవీణ్ కుమార్ తోనే సాధ్యమని అంటున్నారు. ఎందుకంటే సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాలంటే అందుకు ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండి, నిర్భయంగా ప్రశ్నించే ధైర్యమున్న నాయకుడు ఎంపీ అయితే బాగుంటుందని, ఇందుకు ఐపీఎస్ పనిచేసిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అయితేనే సరిపోతారన్న భరోసా ప్రజల్లో ఉంది. అంతేకాకుండా గురుకుల కార్యదర్శిగా పని చేసిన సమయంలో ఎందరో పేద విద్యార్థులకు విద్యను అందించి విద్యా ప్రధాత అయిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ని గెలిపిస్తే విద్యాపరంగా కూడా అభివృద్ధి సాధించవచ్చు అన్న భావనలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వనపర్తి, గద్వాల, అలంపూర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోని దళిత సంఘాలు, విద్యార్థులు, రాజకీయ మేధావులు ఇప్పటికే రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే యువత, ఆర్ఎస్పి అభిమానులు ఆయన గెలుపును భుజాన వేసుకుని ఒక సైనికుల వలే పని చేస్తూ ఆయనను పార్లమెంట్ కు పంపించే బాధ్యతను తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి స్థానికుడు కాకుండా ఖమ్మం వాసి కావడంతో ప్రజలందరు ప్రవీణ్ కుమార్ వైపే మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సైతం రాష్ట్రంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచేది ఒక్క ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్న స్థాయిలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలో ఆయన ఎక్కడ ప్రచారం నిర్వహించినా ప్రజలు, విద్యార్థులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోలో కూడా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం గమనార్హం. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ విజయాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు సాధ్యం కాదని, వారు ఆ దరి దాపుల్లో కూడా లేరని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీదే హవా-ప్రశ్నించే గొంతుక ఒక్క ఆర్ఎస్పీనే అంటున్న ప్రజలు-విద్యావంతుడు ఎంపీ అయితే విద్యాభివృద్ధి సాధ్యం-తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఒక్క ఆర్ఎస్పీనే-పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ గెలుపు ఖాయం అంటున్న బీఆర్ఎస్ శ్రేణులు-కేసీఆర్ రోడ్ షో వల్ల మరింత పెరిగిన అంచనాలు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES