జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ గద్వాల ప్రధాన కార్యదర్శిగా బీఆర్. తిమ్మన్న అలియాస్ బీఆర్. ఇమ్మానియేల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ, కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి కుమారుడు ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇమ్మానియేల్ ని ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మానియేల్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్యలకు, జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ, కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నా వంతు బాధ్యత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని, మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుపుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కష్టపడి పనిచేయడం జరుగుతుందన్నారు.
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీఆర్. తిమ్మన్న ఎంపిక ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES