Saturday, June 28, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వీ6 స్పెషల్ షోలో పాల్గొన్నారు రేవంత్. . స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB)లో సర్వర్లు ధ్వంసమయ్యయనే కేసు నమోదైందని.. ఆ కేసు విచారణలోనే ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చిందన్నారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో తనకు తేలియదన్నారు.

నివేదిక వచ్చిన తరువాత ప్రజలకు పూర్తి వివరాలు చెప్తామన్నారు సీఎం. ఈ కేసులో సూత్రదారులు, పాత్రదారులెవరున్నా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా ఈ కేసులో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular