Sunday, June 29, 2025

మరోసారి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు: ఓరుగల్లు9నేషనల్ టీవీ

మరోసారి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు దర్శనమిచ్చాయి. ఎక్స్‌పైరీ డేట్ ముగియకముందే అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కొన్న చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు పోస్ట్ చేశారు. దీనిపై ఫుడ్ సెఫ్టీ అధికారులనుంచి ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. పోస్ట్ వైరల్ అవుతుంది.పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇటీవలే హైదరాబాద్ అమీర్ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి ఈ చాక్లెట్ కొని కవర్ తెరవగానే పురుగులు కనిపించాయి. దీంతో వెంటనే జీహెచ్ఎంసీకి అధికారులకు ఫిర్యాదు చేయగా.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా ఇవి తింటే ఆరోగ్యానికి హానీకరమని హెచ్చరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా మరోసారి ఇదే చాక్లెట్ లో పురుగులు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular