Sunday, June 29, 2025

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ సూచన మేరకు శనివారం ఉదయం 3గంటల సమయం నుంచి 6గంటల వరకు అయిజ మండలం, పులికల్ గ్రామం దగ్గర ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాల తనిఖీలో కర్ణాటక రాష్ట్రంలోని తలమర్రి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనకవీడు గ్రామానికి కర్ణాటక మద్యం బాటిళ్లను పులికల్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని అరెస్టు చేసి వారి నుంచి 24 కార్టన్ల మద్యం బాటిళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో గద్వాల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గణపతి రెడ్డి, ఎస్ఐ వీరేశలింగం, సిబ్బంది వేణు, శేఖర్ నాయుడు, చందర్, మహేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular