తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా ను దళిత జర్నలిస్తుల ఫోరమ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కాషాపోగు జాన్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగింది. అనంతరం సంఘం ఆదేశాల మేరకు దళిత జర్నలిస్తుల ఫోరమ్ గౌరవ అధ్యక్షులుగా మంత్రిని ఉండాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించి గౌరవ అధ్యక్షులుగా ఉండేందుకు అంగీకారం తెలిపారు. అనంతరం దళిత జర్నలిస్తుల ఫోరమ్ కమిటిని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు సహాకారం అందిస్తానని హామీ ఇచ్చారు.దళిత జర్నలిస్టుల హక్కులకోసం, సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు,డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగత్ ప్రకాశ్, విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ధనుష్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు కొంగళ్ళ కృష్ణయ్య జర్నలిస్టులు మహేష్ రాథోడ్,రాజు, మేఘరాజు నాయక్, మధు,మిల్సన్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన దళిత జర్నలిస్తుల ఫోరమ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES