Sunday, June 29, 2025

ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలు తనిఖీ-కేంద్రాన్ని సీజ్ చేసిన డీఎంహెచ్ఓ శశికళ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. శశికళ, మాత శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి. స్రవంతిలు మంగళవారం అయిజ మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎండి. గౌస్ పాషా, ఎండి. అక్బర్ బాషాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రథమ చికిత్స కేంద్రంలో ఆర్ఎంపిలు పిల్లలు పుట్టని దంపతులకు చికిత్స చేస్తుండడాన్ని గుర్తించి అందుకు వారు ప్రజలకు ఇస్తున్న ఆయుర్వేద మందులు అయిన గాడిద గడప, మిరియాలు, ఎల్లిపాయలు, సొంటి తదితర వాటితో తయారు చేసిన మందులను గుర్తించి వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఆయుర్వేద మందులతోపాటు అల్లోపతి మందులను కూడా పిల్లలు పుట్టని వారికి ఇవ్వడం, సుఖ వ్యాధులకు చికిత్సలు నిర్వహించడంపై ఇద్దరు ఆర్ఎంపీలను హెచ్చరించి వారు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని, ల్యాబ్ ని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఇన్చార్జి డిప్యూటీ డెమో కె. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular