జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల ఆరాధ్య దైవం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జాన్ మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుండి గొప్ప నేతగా ఎదిగిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శం అని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావి తరాలకు స్పూర్తిగా నిలిచిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఆని అన్నారు. డాక్టర్ బిఆర్. అంబేద్కర్ భారత దేశానికి దిక్సూచి అని అన్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచేందుకు అందరూ కృషి చేయాలి అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివి అని గుర్తు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటన్న, జర్నలిస్టులు తాటికుంట తిరుమల్, సీనియర్ జర్నలిస్టులు ముకుందరావు, రామన్ గౌడు, రాఘవ గౌడ్, సుగంధర్, ఆరగిద్ద చారి, శాంతన్న, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గద్వాలలో ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలుదళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES