జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : గతంలోనైనా, ప్రస్తుతం అయిన మాదిగలను ఆదుకుని ఒక సముచిత స్థానం కల్పించింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని…ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకులు మరిచి మాట్లాడటం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీఆర్. ఇమ్మానియేల్ అన్నారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వ్యవసాయ భూములు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా మాదిగలకు ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా ఉచిత కరెంటు సైతం కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని గుర్తు చేశారు. మాదిగలపై దాడులు జరిగితే బాధితులకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసి ఎంతోమంది మాదిగల కుటుంబాలకు అండగా నిలిచి ఆదుకుందని తెలిపారు. మాదిగలను, మాలలను, గిరిజనులను, ఇతర వెనుకబడిన కులాలను గతం నుంచి ఇప్పటివరకు అన్ని విధాల ఆదుకున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ అన్నది గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు తమ స్వార్థ లాభాల కోసం కలిసిమెలిసి ఉంటున్న మాదిగ, మాలలను మధ్య చిచ్చుపెట్టి వారిని విడగొట్టడానికి కుట్రలు చేస్తూ ఎంపీ ఎన్నికల్లో మతోన్మాద పార్టీ అయిన బిజెపి పార్టీని గెలిపించడానికి పూనుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మాదిగల అభివృద్ధికి చేసింది ఏమిటని, దీనిపై పదేళ్లు ఎమ్మార్పీఎస్ నాయకులు ఎందుకు నోరుమెదపకుండా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలు నమ్మి మాదిగ సోదరులు మోసపోవద్దని, ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపాలని, ఇందుకుగానూ ప్రతి మాదిగ బిడ్డ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు గెలిపించాలని ఇమ్మానియేల్ కోరారు.
మాదిగలను ఆదుకున్నది.. అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే-బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దు-కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీఆర్. ఇమ్మానియేల్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES