Sunday, June 29, 2025

జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మందస్తు చర్యలు-జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా మందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ తో కలిసి ప్రస్తుత పరిస్థితిలో త్రాగునీటి సరఫరా అంశంపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గతవారం జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల పట్ల చేపట్టిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే రెండు నెలల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యతతో పని చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు అందరూ ప్రతిరోజు నాలుగు గ్రామాలను సందర్శించి ఎల్లో జోన్, ఆరెంజ్ జోన్ వివరాలను అందజేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాలలో ప్రత్యమ్నయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ ల మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను సక్రమంగా నిర్వహించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని వచ్చే రెండు నెలలు ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, జెడ్పి సీఈవో కాంతమ్మ, డిఆర్డిఓ నర్సింగరావు, డిపిఓ వెంకట్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular