జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో నీరు లేక ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి నష్టపరిహారంగా రూ. 25వేలు ఇవ్వాలని, ధాన్యం కొనుగోలుపై క్వింటాలుకు అదనంగా రూ. 500లు బోనస్ ఇవ్వాలని, వీటితోపాటుగా వారంటీ గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో మాయ మాటలు చెప్పి రైతులకు మోస పూర్వకమైన పథకాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క రైతుతో మాట్లాడిన పాపాన పోలేదని, రైతుల గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన కెసిఆర్ తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోయినా రైతుల కోసం అండగా నిలవడం జరిగిందన్నారు. కరువుతో బాధపడుతున్న రైతులకు నేను, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ ప్రతి రైతును కలిసి మాట్లాడుతూ వారి కష్టసుఖాలను, బాధలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అధికారులతో సమీక్షించి రాష్ట్రానికి రావాల్సిన కరెంటును, నీళ్లను విడుదల చేయించి ఎండాకాలంలో చేతికొచ్చిన పంటలు ఎండిపోకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రైతులకు నీళ్లు అందించకపోతే గద్వాల నియోజకవర్గంలో ఈ నెల15న జల దీక్ష కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గ రైతాంగం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జలదీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బలపరిచిన అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, కౌన్సిలర్ నాగిరెడ్డి, మురళి, నరహరి శ్రీనివాసులు, దౌలు, ఎంపీటీసీ దౌలన్న, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు గోవిందు, డిఆర్. విజయ్, ఉరుకుందు, రమేష్ నాయుడు, సత్యరెడ్డి, విక్రమ్ సింహరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, చక్రధర్ రావు, హనుమంతు, రాధాకృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి, తూం కృష్ణ రెడ్డి, సతీష్, షుకూర్, మాజీద్, అజయ్, వెంకటేశ్వర రెడ్డి, సాయి శ్యామ్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, కృష్ణయ్య సార్, ధర్మ నాయుడు, రిజ్వాన్, భగీరథ వంశీ, మహబూబ్, నవీన్ రెడ్డి, కురుమన్న, హరి ప్రసాద్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, మోబీన్, నరేందర్ రెడ్డి, యుగంధర్ గౌడ్, బీచుపల్లి, నీలేశ్వర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, రమేష్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, శ్యామ్, సీతారాములు, జానకీ రాములు, మధు, పూడూరు రఘు, రామాంజనేయులు, లక్ష్మన్న, నరసింహులు, పరుశ, గంట రమేష్, గంగాధర్ గౌడ్, రాజు, విజయ్, పరశురాముడు, గోవిందు, రాముడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతులను ప్రభుత్వం ఆదుకునే వరకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది-రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి-గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES