జోగులమ్మ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి వేలాది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత పిలుపునిచ్చారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిపెస్టోను తెలంగాణలోని తుక్కుగూడ సభలో ప్రకటించి ఎన్నికల సమరశంఖం పూరించనున్నట్లు తెలిపారు. తుక్కుగూడ రాజీవ్గాంధీ ప్రాంగణం వేదికగా జరిగే జన జాతరకు గద్వాల నియోజకవర్గంలోని పల్లె పల్లె నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని ఆమె కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలను పునరావృతం వేసే విధంగా తుక్కుగూడ సభ ఉంటుందని, ఈ సభ ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వడమే లక్ష్యంగా, సభలో ప్రజా పాలనకు నాంది పలుకుతూ రాబోయే తరాల భావి భారత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయడమే ఆశయంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సభకు తరలివచ్చి జన జాతర సభను విజయవంతం చేయాలని సరిత కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవీర రెడ్డి, గడ్డం చెన్నకేశవ రెడ్డి, మధుసూదన్ బాబు, డిటిడిసి నర్సింహులు, కౌన్సిలర్లు నరహరి గౌడ్, టి. శ్రీనివాసులు, తుమ్మల నర్సింహులు, భాస్కర్ యాదవ్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, జమ్మిచేడు సురేష్, మాల మహానాడు శ్రీనివాసులు, జగదీష్, కొత్త గణేష్, నంబర్ నర్సింహులు, రాంచందర్, గడ్డం శ్రీను, షాష, గుడ్డెందొడ్డి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
తుక్కుగూడ జన జాతర సభను జయప్రదం చేయాలి-జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జి సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES