Saturday, April 19, 2025

ఏప్రిల్ 15న మెదక్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ :ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై గట్టి ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేసిన ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచార దూకుడు పెంచేశారు. కరీంనగర్ సభతో ఎన్నికల శంఖరావాన్ని పూరించిన కేసీఆర్.. ఏప్రిల్ 15న మెదక్ లో పర్యటించనున్నారు. మెదక్ లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది.

మెదక్ పార్లమెంట్ స్థానంపై మొదటినుంచి బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. 2009 నుంచి ఇక్కడి బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014, 2019లో ఇక్కడి నుండి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular